ఘనంగా సర్వోత్తమ్ జన్మదిన వేడుకలు
ఘనంగా సర్వోత్తమ్ జన్మదిన వేడుకలు
Biksham
సూర్యాపేట జిల్లా కేంద్రం ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్ హౌస్)లో ఘనంగా నిర్వహించారు. జిల్లా వాణిజ్య సెల్ చైర్మన్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేకు కట్ చేసి సర్వోత్తమ్ రెడ్డి జన్మదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ సర్వోత్తమ్ రెడ్డి పార్టీకి చేస్తున్న సేవలను కొనియాడుతూ, ప్రజలతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి