ఘనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి
ఘనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి
K.RAVI
లింగోజిగూడెంలో ఉత్సాహభరిత వాతావరణం – పెండింగ్ సమస్యల పరిష్కారానికి హామీ
చౌటుప్పల్ మున్సిపాలిటీ 3వ వార్డు (లింగోజిగూడెం) కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డీ ఆదివారం వార్డు కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు, మహిళలు, నాయకులు భారీగా హాజరై కౌన్సిలర్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం కౌన్సిలర్ పల్లె లావణ్య మాట్లాడుతూ, వార్డులో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ సహకారంతో త్వరితగతిన నెరవేర్చుతానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై విశ్వాసం ఉంచిన వార్డు ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మునుగోడు ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్, ఇన్చార్జి వెల్గ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బి.యన్. రెడ్డి, గుండు మల్లయ్య, కౌన్సిలర్లు హన్ను బాయ్, చింతల ఉమామహేశ్వరి సాయిలు, బత్తుల వాణి విప్లవ్ గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, వార్డు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి