PRINT TIME: May 10, 2026 03:04 PM
ఘనంగా లక్ష్మమ్మ అవ్వ జాతర
ఘనంగా లక్ష్మమ్మ అవ్వ జాతర
May 10, 2026 01:21 PM
27 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని నియోజకవర్గంలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ నగర్లో లక్ష్మమ్మ అవ్వ జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను టీడీపీ యువ నాయకులు కొంక భూపాల్ చౌదరి, కొంక సిద్ధార్థ నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు.
జాతర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఇందిరానగర్ ఇంచార్జి ఐసీ రామకృష్ణ పాల్గొన్నారు. అలాగే వలి, రంగన్న, గౌస్, శరభ, రాజేష్, అంగడి కిట్ట, శేఖర్, అంజి, నరసప్ప, నాగరాజు, మంగన్న, శెట్టిబలిజ కృష్ణ, మురళి తదితరులతో పాటు వార్డ్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి