Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

ఘనంగా ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు

ఘనంగా ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు

ఘనంగా ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు
February 19, 2026 07:22 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వందమంది ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాల పంపిణీ – నాయకుల శుభాకాంక్షలు వెల్లువ

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలు గురువారం ఖమ్మంలోని ఎంపీ శిబిర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి, మంత్రి పొంగులేటి శిబిర కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి , కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగేందర్ , ఎదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పీ. అనిత గారు, ఉపాధ్యక్షులు తమ్మినేని నవీన్ తదితరులు కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాటల్లో నిబద్ధత, చేతల్లో పారదర్శకత కలిగిన గొప్ప నాయకుడు రఘురాం రెడ్డి గని కొనియాడారు. ఎంపీ పదవిని ఒక బాధ్యతగా భావించి తన సమర్థ నాయకత్వంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం వివిధ అడ్డాలకు చెందిన వందమంది ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ యార్లగడ్డ హనుమంతరావు , మాజీ మార్కెట్ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు దీపక్ చౌదరి , న్యాయవాది స్వామి రమేష్ కుమార్, టెలిఫోన్ సలహా సంఘ సభ్యులు ఇమామ్ భాయ్, రంజిత్ నాయక్ , స్ఫూర్తి ఓం రాధాకృష్ణ , ఇతర నాయకులు లింగాల రవికుమార్, వడ్డేబోయిన నరసింహారావు , చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీకళా రెడ్డి , మొగిలిచర్ల సైదులు , చింతమల్ల గురుమూర్తి , కరాటే వేణు, విప్లవ్ కుమార్ తదితరులు, పలువురు కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News