ఘనంగా హనుమాన్ విజయోత్సవ వేడుకలు
ఘనంగా హనుమాన్ విజయోత్సవ వేడుకలు
K.RAVI
హనుమాన్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పెరుమాళ్ల ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం ఉదయం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి అభిషేక కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తి శ్రద్ధలతో జరిగింది. చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో మున్సిపాలిటీ ప్రజలు సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాల తో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకవర్గ గౌరవ అధ్యక్షుడు ముత్యాల భూపాల్ రెడ్డి, అధ్యక్షుడు ఉప్పు ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు అన్నమోని చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి పోలోజు శ్రీనివాస్, కోశాధికారి పోలోజు శ్రీనివాస్ చారి, సభ్యులు మండే మల్లేష్, కలకుంట్ల శివ, సుంకి రవి, కర్నాటి జనార్ధన్, పాలాది రఘుపతి, నామని వీరేశం, గుర్రం బాలరాజు, ఎక్కలదేవి శివ, గజ్జల రాజు, బిర్రు శ్రీహరి, సుంకి లావణ్య, స్వరూప,కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్బు శ్రీకాంత్, సుర్కంటి బాలకృష్ణారెడ్డి, దేవస్థానం పూజారి బొల్లోజు విష్ణు చారి, పాత్రికేయులు హనుమంత్ రెడ్డి, ఎర్రసాని సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి