ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు
ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు
Biksham
జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ రోడ్డులో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ధరూరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది.
ఈ సందర్భంగా భానుపురి హనుమాన్ చాలీసా భక్త బృందం, హనుమత్ దీక్ష భక్త బృందం, హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం కలిసి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం వేద పండితులు స్వామివారికి నిత్య ఆరాధన, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చనలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి నూతన పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా ఆరగింపు, మంగళశాసనం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. అలాగే అన్నప్రసాద వితరణను ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ వేడుకలకు ఏఐసీసీ నాయకులు రామ్రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, సుధాకర్, పివిసి మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్ హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలంతా శ్రీ ఆంజనేయ స్వామి కృపతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో లింగమంతుల స్వామి దేవాలయం చైర్మన్ పోలబోయిన నరసయ్య యాదవ్, రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు మోరీశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్లు ఎలిమినేటి అభినయ్, కొండపల్లి దిలీప్ రెడ్డి, గుణగంటి హేమ, నాయకులు బాలు గౌడ్, అబ్దుల్ రహీం, తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, ప్రవీణ్ రెడ్డి, మధ్యబోయిన శ్రీనివాస్, చల్లా లక్ష్మీకాంత్, జయప్రసాద్, ఎస్ఎల్ఎస్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దేవాలయ అధ్యక్షులు కొత్తా ఆంజనేయులు, కార్యనిర్వాహణాధికారి ఎం.పీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టగా వేద పండితులు ధరూరి శ్రీధరాచార్యులు, శ్రీనాథాచార్యులు, పవన్కుమార్ చార్యులు, కార్తీకాచార్యులు, శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి