Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 10:32 PM

ఘనంగా ధర్మబిక్షం 15వ వర్ధంతి కార్యక్రమం

ఘనంగా ధర్మబిక్షం 15వ వర్ధంతి కార్యక్రమం

ఘనంగా ధర్మబిక్షం 15వ వర్ధంతి కార్యక్రమం
March 26, 2026 08:45 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు మండల కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు,తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,మాజీ ఎమ్మెల్యే మరియు పార్లమెంట్ సభ్యుడు బొమ్మగాని ధర్మబిక్షం గారి 15వ వర్ధంతిని సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ,సిపిఐ మండల కార్యదర్శి గాదగాని మాణిక్యం హాజరై ధర్మబిక్షం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ధర్మబిక్షం గారు స్వాతంత్ర్య సమరయోధుడిగా,తెలంగాణ సాయుధ పోరాట వీరుడిగా ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు.మూడు సార్లు ఎమ్మెల్యేగా,రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు.సాయుధ పోరాట కాలంలో “తీసేవానిదే చెట్టు వానిదే భూమి” అనే నినాదంతో ప్రజల కోసం పోరాడిన ఆయన,అరాజక విధానాల రద్దు,మద్యపాన నిషేధం,చెట్టు పెంపకం కోసం భూముల కేటాయింపు వంటి అనేక సమస్యలను అసెంబ్లీ మరియు పార్లమెంటులో లేవనెత్తారని తెలిపారు.ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు బీరకాయల మల్లేష్,గ్రామ శాఖ సహాయ కార్యదర్శి జివికెలపల్లి పాండు,ఏఐవైఎఫ్ అధ్యక్షుడు బీరకాయల మధు,ఎండి గుంశీ ఎర్ర కృష్ణయ్య,బీరకాయల పోశయ్య,మొగిలిపాక యాదయ్య,తంబాల మధు,బీరకాయల రాములు,వడ్డబోయిన అచ్చయ్య,బిక్షపతి,మైసయ్య,సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News