Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:43 PM

ఘనంగా ధర్మబిక్షం 15వ వర్ధంతి కార్యక్రమం

ఘనంగా ధర్మబిక్షం 15వ వర్ధంతి కార్యక్రమం

ఘనంగా ధర్మబిక్షం 15వ వర్ధంతి కార్యక్రమం
March 26, 2026 08:45 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు మండల కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు,తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,మాజీ ఎమ్మెల్యే మరియు పార్లమెంట్ సభ్యుడు బొమ్మగాని ధర్మబిక్షం గారి 15వ వర్ధంతిని సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ,సిపిఐ మండల కార్యదర్శి గాదగాని మాణిక్యం హాజరై ధర్మబిక్షం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ధర్మబిక్షం గారు స్వాతంత్ర్య సమరయోధుడిగా,తెలంగాణ సాయుధ పోరాట వీరుడిగా ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు.మూడు సార్లు ఎమ్మెల్యేగా,రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు.సాయుధ పోరాట కాలంలో “తీసేవానిదే చెట్టు వానిదే భూమి” అనే నినాదంతో ప్రజల కోసం పోరాడిన ఆయన,అరాజక విధానాల రద్దు,మద్యపాన నిషేధం,చెట్టు పెంపకం కోసం భూముల కేటాయింపు వంటి అనేక సమస్యలను అసెంబ్లీ మరియు పార్లమెంటులో లేవనెత్తారని తెలిపారు.ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు బీరకాయల మల్లేష్,గ్రామ శాఖ సహాయ కార్యదర్శి జివికెలపల్లి పాండు,ఏఐవైఎఫ్ అధ్యక్షుడు బీరకాయల మధు,ఎండి గుంశీ ఎర్ర కృష్ణయ్య,బీరకాయల పోశయ్య,మొగిలిపాక యాదయ్య,తంబాల మధు,బీరకాయల రాములు,వడ్డబోయిన అచ్చయ్య,బిక్షపతి,మైసయ్య,సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News