ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు
ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు
K.RAVI
లింగోజిగూడెం హైవే వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రముఖులు
భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయకోవిదులు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు లింగోజిగూడెం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. మంగళవారం లింగోజిగూడెం హైవే సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖ్యఅతిథిగా పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్, లింగోజిగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్నె శివారెడ్డి, ఉపాధ్యక్షులు ఎర్రగోని నవీన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బోసి హరిబాబు, కార్యదర్శి తీగల రాజు, ఎస్సీ సెల్ అధ్యక్షులు అనుమాసిపేట లింగస్వామి, మున్సిపల్ ఉపాధ్యక్షులు కళ్లెం దయాకర్ రెడ్డి, ఎర్రగోని లింగస్వామి, శివమహదేవ దేవాలయ చైర్మన్ బండమీది ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి బండమీది వెంకటేష్, నాయకులు ఊదరి అంజయ్య, బాతరాజు యాదయ్య, బోసి శంకర్, ఊదరి క్రాంతి, ముత్యాలు మహేష్, బాతరాజు రాజశేఖర్, బద్రి సాయిరాం, బాతరాజు యాదగిరి, ముత్యాల సునీల్, ముత్యాల కిరణ్, పిల్ల వెంకటేష్, పిల్ల మల్లేష్, పిల్ల తరుణ్, బండమీది శివ గణేష్, బండమీది సిద్దు, కొయ్యలగూడెం సంతోష్, బాతరాజు శివ, బండమీది మహేష్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి