ఘనంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ప్రారంభోత్సవం
ఘనంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ప్రారంభోత్సవం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి: రేపు తేది 13-03-2026 సాయంత్రం 4.00 గంటలకు అన్నదాత సుఖీభవ (3వ విడత) మరియు పీఎం కిసాన్ (22వ విడత) ప్రారంభోత్సవ కార్యక్రమం ముసునూరు మండలంలోని చెక్కపల్లి గ్రామంలో నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహించనున్నట్లు చాట్రాయి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు తెలిపారు.
రైతులకు ఆర్థిక సహాయం అందించే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రైతు సంక్షేమానికి చేపడుతున్న పథకాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి చాట్రాయి మండలం నుంచి రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పత్రికా విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులకు మరింత ఉపయోగకరంగా మారేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి