Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:36 AM

ఘనంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ప్రారంభోత్సవం

ఘనంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ప్రారంభోత్సవం

ఘనంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ప్రారంభోత్సవం
12-03-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి: రేపు తేది 13-03-2026 సాయంత్రం 4.00 గంటలకు అన్నదాత సుఖీభవ (3వ విడత) మరియు పీఎం కిసాన్ (22వ విడత) ప్రారంభోత్సవ కార్యక్రమం ముసునూరు మండలంలోని చెక్కపల్లి గ్రామంలో నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహించనున్నట్లు చాట్రాయి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు తెలిపారు.

రైతులకు ఆర్థిక సహాయం అందించే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రైతు సంక్షేమానికి చేపడుతున్న పథకాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి చాట్రాయి మండలం నుంచి రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పత్రికా విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులకు మరింత ఉపయోగకరంగా మారేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఘనంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ప్రారంభోత్సవం

Article Image

చాట్రాయి: రేపు తేది 13-03-2026 సాయంత్రం 4.00 గంటలకు అన్నదాత సుఖీభవ (3వ విడత) మరియు పీఎం కిసాన్ (22వ విడత) ప్రారంభోత్సవ కార్యక్రమం ముసునూరు మండలంలోని చెక్కపల్లి గ్రామంలో నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహించనున్నట్లు చాట్రాయి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు తెలిపారు.

రైతులకు ఆర్థిక సహాయం అందించే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రైతు సంక్షేమానికి చేపడుతున్న పథకాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి చాట్రాయి మండలం నుంచి రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పత్రికా విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులకు మరింత ఉపయోగకరంగా మారేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News