Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:00 PM

ఘనంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ప్రారంభోత్సవం

ఘనంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ప్రారంభోత్సవం

ఘనంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ప్రారంభోత్సవం
March 12, 2026 07:40 PM 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి: రేపు తేది 13-03-2026 సాయంత్రం 4.00 గంటలకు అన్నదాత సుఖీభవ (3వ విడత) మరియు పీఎం కిసాన్ (22వ విడత) ప్రారంభోత్సవ కార్యక్రమం ముసునూరు మండలంలోని చెక్కపల్లి గ్రామంలో నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహించనున్నట్లు చాట్రాయి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు తెలిపారు.

రైతులకు ఆర్థిక సహాయం అందించే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రైతు సంక్షేమానికి చేపడుతున్న పథకాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి చాట్రాయి మండలం నుంచి రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పత్రికా విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులకు మరింత ఉపయోగకరంగా మారేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News