Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:45 PM

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
December 28, 2025 03:12 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ


తెలంగాణ ఇచ్చిన పార్టీ


ప్రజాపాలన తో ముందుకు నడుస్తున్న పార్టీ


డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య


వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి


స్థానికం ప్రతినిధి జెర్రిపోతుల బిక్షం


భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం(రెడ్ హౌస్) లో పార్టీ పతకావిష్కరణ చేసిన డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.


కాంగ్రెస్ అంటే ప్రజల కోసం పోరాటం,కాంగ్రెస్ అంటే అభివృద్ధి,సంక్షేమం,కాంగ్రెస్ అంటే ప్రజల భవిష్యత్ అని దేశ స్వాతంత్ర్యానికి పునాది వేసి, సామాజిక న్యాయం, సమానత్వం,ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ

దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఏకైక పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 8న బొంబాయిలో 72 మంది తో ఏర్పడ్డ జాతీయ కాంగ్రెస్ పార్టీ నేడు దేశంలోని 140 కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు.


దేశ స్వాతంత్రం కోసం ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు.


దేశంలో ప్రజలను ఐక్యం చేసి బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం తేవడంలో కీలకపాత్ర వహించింది కాంగ్రెస్ అని అన్నారు. ఎంతో మంది స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు అయ్యి కుటుంబాలను, ఆస్తులను త్యాగం చేసి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశంలో ప్రజలు తీవ్రమైన పేదరికంలో ఉన్నారని తెలిపారు. ఒకవైపు ప్రజలు కనీస అవసరాలు తీర్చడం, మరోవైపు దేశాన్ని పటిష్టం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసిన సేవలు ప్రజలు మరవలేరన్నారు.


50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక పరిపుష్టి గల దేశంగా తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చారు. గాంధీ, నెహ్రూల కలయిక ఈ దేశానికి ఎంతో మేలు చేసిందన్నారు. వేలాది మంది త్యాగం, వారి జైలు జీవితం వారి నిస్వార్థ సేవతోనే నేడు మనం స్వతంత్ర దేశంలో అన్ని హక్కులను అనుభవిస్తూ జీవిస్తున్నామన్నారు.


కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లుగా ఈ దేశంలో ఒక పటిష్టమైన పార్టీగా నెలదొక్కుకుందంటే ఆ పార్టీ మూల సిద్ధాంతాలు.. పార్టీలోని నాయకులు కారణమన్నారు.


సోనియమ్మ, పీవీ, మన్మోహన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు దేశం కోసం నిరంతరం శ్రమించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలను తీర్చినా అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అయ్యిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా అధికారంలోకి వచ్చామన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News