Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:25 PM

గెలిచిన అభ్యర్థులు బాధ్యతగా ఉండాలి – ప్రజల తీర్పును గౌరవించాలి

గెలిచిన అభ్యర్థులు బాధ్యతగా ఉండాలి – ప్రజల తీర్పును గౌరవించాలి

గెలిచిన అభ్యర్థులు బాధ్యతగా ఉండాలి – ప్రజల తీర్పును గౌరవించాలి
February 13, 2026 06:38 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచాకు అనుమతి లేదు – జిల్లా పోలీసు అధికారి నరసింహ హెచ్చరిక

జిల్లా కేంద్రం: మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా పోలీసు అధికారి నరసింహ ఐపీఎస్ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16వ తేదీ వరకు, మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అందువల్ల గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి, బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదని తెలిపారు.ప్రజల తీర్పును, ఎన్నికల ఫలితాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని కోరారు. వార్డులు, కాలనీల్లో ఎవరూ గొడవలకు దిగకూడదని, వ్యక్తులను కించపరిచేలా మాట్లాడకూడదని సూచించారు. తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని హెచ్చరించారు. యువత ఆదర్శంగా ఉండాలని, ద్విచక్ర వాహనాలపై వేగంగా తిరుగుతూ ప్రమాదాలకు గురికాకూడదని సూచించారు.

గెలిచిన వారు మరింత బాధ్యతగా ఉండాలని, ఓడిన వారు నిరుత్సాహపడకుండా ప్రజల మన్ననలు పొందుతూ మరో అవకాశానికి సిద్ధం కావాలని తెలిపారు. ప్రజలకు సేవలు అందించడంలో ముందుండాలని అన్నారు. మహాయజ్ఞంలా సాగిన మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణలో ప్రజల భద్రత, ఓటర్ల భద్రత పట్ల అప్రమత్తంగా పనిచేసిన ప్రతి పోలీసు సిబ్బందిని జిల్లా పోలీసు అధికారి అభినందించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది సేవలను కొనియాడారు.ఎన్నికల నిర్వహణలో సహకరించిన వివిధ శాఖల సిబ్బందికి, ఓటర్లకు, అభ్యర్థులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరింత పటిష్టంగా పనిచేసి ప్రజలకు పోలీసు సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ముగిసే వరకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వార్డులు, కాలనీల్లో నిఘా కొనసాగించాలని సూచించారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News