Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:12 AM

గ్యాస్ ధరల పెంపు, కొరతపై సిపిఎం ఆగ్రహం

గ్యాస్ ధరల పెంపు, కొరతపై సిపిఎం ఆగ్రహం

గ్యాస్ ధరల పెంపు, కొరతపై సిపిఎం ఆగ్రహం
March 15, 2026 06:46 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సివిల్ సప్లై హమాలి యూనియన్ కార్యాలయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు నాగరాజు మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజున మహిళలకు కానుకలు ఇవ్వకపోగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి మహిళలపై అదనపు భారాన్ని మోపడం దుర్మార్గమని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తీవ్ర కొరత ఉందన్నారు.

సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు హరి మాట్లాడుతూ ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు వంటి అంతర్జాతీయ పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆ వైఫల్య భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమని పేర్కొన్నారు.

సిపిఎం నాయకుడు బాబావలి మాట్లాడుతూ ప్రభుత్వాలు ధరలు పెంచడం వల్ల చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాణిజ్య సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఉగాది, రంజాన్ వంటి పెద్ద పండగలు జరుపుకునే పరిస్థితి లేదన్నారు. అధికారులు వెంటనే వాణిజ్య సిలిండర్లు అందుబాటులోకి తెచ్చి చిన్న వ్యాపారస్తులకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే చిరు వ్యాపారస్తులు, ప్రజలను ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకట్రాముడు, ఆనందు, తిప్పన, హనుమంతు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News