గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు
గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల మునగాల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు.ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..కేవైసీ అప్ డేట్, సబ్సిడీ పేరుతో వచ్చే నకిలీ లింకులు క్లిక్ చేయవద్దని, ఓటీపీలు పంపవద్దని మండల ప్రజలకు సూచించారు.బుకింగ్ కోసం అధికారిక యూప్ లు మాత్రమే వాడాలన్నారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి