Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:42 PM

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
January 22, 2026 08:16 PM 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మట్టపల్లిలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుక్రవారం సూర్యాపేట జిల్లా మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా డయాస్ ఏర్పాటు, ప్రముఖులు ఇతరులకు కేటాయించిన సీటింగ్, పబ్లిక్ అడ్రస్ వ్యవస్థ, ఎల్ఈడీ ఏర్పాట్లు, డయాస్ సమీపంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు సంబంధించిన శిలాఫలకాల అమరికలను పరిశీలించారు. గవర్నర్‌కు ఇచ్చే పోలీసు గౌరవ వందనం, వివిధ శాఖలు ఏర్పాటు చేస్తున్న స్టాళ్లు, దేవాలయ అలంకరణ తదితర అంశాలను కలెక్టర్, ఎస్పీ సమగ్రంగా తనిఖీ చేసి అధికారులకు సూచనలు జారీ చేశారు.గవర్నర్ రాక సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఆయన మట్టపల్లికి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు అన్ని కార్యక్రమాలు సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.గవర్నర్ మట్టపల్లి సందర్శన సందర్భంగా హుజూర్నగర్ సమీపంలోని ముగ్దుమ్ నగర్ వద్ద వంద ఇరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, కోదాడలో యాభై కోట్ల రూపాయలతో నిర్మించనున్న జవహర్ నవోదయ విద్యాలయ భవనానికి, మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఒక కోట్ల రూపాయలతో నిర్మించనున్న వసతి గృహం, వంటశాల, తాగునీటి ట్యాంకుకు, అలాగే మరో ఒక కోట్ల రూపాయలతో నిర్మించనున్న యాత్రికుల సదన్, పిపిజిఐ షెడ్, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.అలాగే దేవాలయ ఆవరణలో వ్యవసాయ, పౌర సరఫరాలు, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి, విద్య, నీటిపారుదల, గృహ నిర్మాణ శాఖల ద్వారా ఏర్పాటు చేస్తున్న స్టాళ్లను గవర్నర్ సందర్శించనున్నారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఆర్డీవోలు, పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News