Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:59 AM

గురుకులాల్లో నాణ్యత తప్పనిసరి: డిప్యూటీ సీఎం స్పష్టం

గురుకులాల్లో నాణ్యత తప్పనిసరి: డిప్యూటీ సీఎం స్పష్టం

గురుకులాల్లో నాణ్యత తప్పనిసరి: డిప్యూటీ సీఎం స్పష్టం
24-12-2025 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాణ్యమైన మానవ వనరులే రాష్ట్ర అభివృద్ధికి పునాది: భట్టి విక్రమార్క

ఖమ్మం/ స్థానికం ప్రతినిధి

నాణ్యమైన మానవ వనరులతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో బుధవారం విద్య, సంక్షేమ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తూ, పిల్లలకు నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్య తప్పనిసరిగా అందించాలని అధికారులను ఆదేశించారు.

మధిర నియోజకవర్గంలోని మూడు మోడల్ పాఠశాలల పనులు రాబోయే విద్యాసంవత్సరం నాటికి పూర్తి చేయాలని, గురుకులాలను జిల్లా అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని చెప్పారు. గురుకులాల్లో ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై రాజీపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. యంగ్ ఇండియా గురుకులాల పనులు వేగవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ స్పెషల్ క్లాసులు నిర్వహించాలని సూచించారు.

ఇందిరా గిరి జల వికాసం కింద ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చదువు నైపుణ్యాలు మెరుగవుతున్నాయని అధికారులు వివరించారు.

Sthanikam

గురుకులాల్లో నాణ్యత తప్పనిసరి: డిప్యూటీ సీఎం స్పష్టం

Article Image

నాణ్యమైన మానవ వనరులే రాష్ట్ర అభివృద్ధికి పునాది: భట్టి విక్రమార్క

ఖమ్మం/ స్థానికం ప్రతినిధి

నాణ్యమైన మానవ వనరులతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో బుధవారం విద్య, సంక్షేమ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తూ, పిల్లలకు నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్య తప్పనిసరిగా అందించాలని అధికారులను ఆదేశించారు.

మధిర నియోజకవర్గంలోని మూడు మోడల్ పాఠశాలల పనులు రాబోయే విద్యాసంవత్సరం నాటికి పూర్తి చేయాలని, గురుకులాలను జిల్లా అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని చెప్పారు. గురుకులాల్లో ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై రాజీపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. యంగ్ ఇండియా గురుకులాల పనులు వేగవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ స్పెషల్ క్లాసులు నిర్వహించాలని సూచించారు.

ఇందిరా గిరి జల వికాసం కింద ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చదువు నైపుణ్యాలు మెరుగవుతున్నాయని అధికారులు వివరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News