Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:22 AM

గురుకులాల్లో నాణ్యత తప్పనిసరి: డిప్యూటీ సీఎం స్పష్టం

గురుకులాల్లో నాణ్యత తప్పనిసరి: డిప్యూటీ సీఎం స్పష్టం

గురుకులాల్లో నాణ్యత తప్పనిసరి: డిప్యూటీ సీఎం స్పష్టం
December 24, 2025 08:25 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాణ్యమైన మానవ వనరులే రాష్ట్ర అభివృద్ధికి పునాది: భట్టి విక్రమార్క

ఖమ్మం/ స్థానికం ప్రతినిధి

నాణ్యమైన మానవ వనరులతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో బుధవారం విద్య, సంక్షేమ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తూ, పిల్లలకు నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్య తప్పనిసరిగా అందించాలని అధికారులను ఆదేశించారు.

మధిర నియోజకవర్గంలోని మూడు మోడల్ పాఠశాలల పనులు రాబోయే విద్యాసంవత్సరం నాటికి పూర్తి చేయాలని, గురుకులాలను జిల్లా అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని చెప్పారు. గురుకులాల్లో ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై రాజీపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. యంగ్ ఇండియా గురుకులాల పనులు వేగవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ స్పెషల్ క్లాసులు నిర్వహించాలని సూచించారు.

ఇందిరా గిరి జల వికాసం కింద ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చదువు నైపుణ్యాలు మెరుగవుతున్నాయని అధికారులు వివరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News