Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:58 AM

గురుజువాడ నూతన సర్పంచ్‌గా మ్యతరీ ప్రియాంక రాజేందర్

గురుజువాడ నూతన సర్పంచ్‌గా మ్యతరీ ప్రియాంక రాజేందర్

గురుజువాడ నూతన సర్పంచ్‌గా మ్యతరీ ప్రియాంక రాజేందర్
23-12-2025 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం

సంగారెడ్డి జిల్లా, స్థానికం ప్రతినిధి

జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల పరిధిలోని గురుజువాడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నూతన పాలకవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మ్యతరీ ప్రియాంక రాజేందర్ సర్పంచ్‌గా, సాయి కుమార్ ఉపసర్పంచ్‌గా, పది మంది వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.

పంచాయతీ కార్యదర్శి బి. గీత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

గురుజువాడ నూతన సర్పంచ్‌గా మ్యతరీ ప్రియాంక రాజేందర్

Article Image

పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం

సంగారెడ్డి జిల్లా, స్థానికం ప్రతినిధి

జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల పరిధిలోని గురుజువాడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నూతన పాలకవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మ్యతరీ ప్రియాంక రాజేందర్ సర్పంచ్‌గా, సాయి కుమార్ ఉపసర్పంచ్‌గా, పది మంది వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.

పంచాయతీ కార్యదర్శి బి. గీత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News