Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:03 AM

గురుజువాడ నూతన సర్పంచ్‌గా మ్యతరీ ప్రియాంక రాజేందర్

గురుజువాడ నూతన సర్పంచ్‌గా మ్యతరీ ప్రియాంక రాజేందర్

గురుజువాడ నూతన సర్పంచ్‌గా మ్యతరీ ప్రియాంక రాజేందర్
December 23, 2025 08:08 PM 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం

సంగారెడ్డి జిల్లా, స్థానికం ప్రతినిధి

జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల పరిధిలోని గురుజువాడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నూతన పాలకవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మ్యతరీ ప్రియాంక రాజేందర్ సర్పంచ్‌గా, సాయి కుమార్ ఉపసర్పంచ్‌గా, పది మంది వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.

పంచాయతీ కార్యదర్శి బి. గీత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News