గుండ్రాంపల్లిలో గౌడ కుల నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
గుండ్రాంపల్లిలో గౌడ కుల నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
Editor Desk
గుండ్రాంపల్లిలో నూతనంగా ఎన్నికైన గౌడ ప్రజాప్రతినిధులకు సత్కారం
చిట్యాల స్థానికం ప్రతినిధి
గుండ్రాంపల్లి కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో గౌడ కులానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు బొడిగె అంజయ్య గౌడ్ అధ్యక్షత వహించారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌడ కులానికి చెందిన అభ్యర్థులు ప్రజల విశ్వాసంతో గెలుపొందడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం కోసం నూతన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీ ప్రసన్న నర్సింహ మాట్లాడుతూ. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాము అన్నారు. సన్మాన కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు, కుల పెద్దలు, గ్రామ ప్రముఖులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి