Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:25 PM

గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ గొరిగే నరసింహ మృతి – నివాళులర్పించిన చిరుమర్తి లింగయ్య

గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ గొరిగే నరసింహ మృతి – నివాళులర్పించిన చిరుమర్తి లింగయ్య

గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ గొరిగే నరసింహ మృతి – నివాళులర్పించిన చిరుమర్తి లింగయ్య
December 26, 2025 05:31 PM 401 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాజీ ఎంపీటీసీ గొరిగే నరసింహ మృతికి నివాళులు

రామన్నపేట: స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండల కేంద్రానికి చెందిన ఎంపీటీసీ–1 మాజీ సభ్యుడు గొరిగే నరసింహ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేటలోని నరసింహ నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నరసింహ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ బందెల రాములు, పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్, ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్, మాజీ ఎంపీటీసీలు వేమవరం సుధీర్ బాబు, ఎండి ఆమీర్, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, బద్దుల రమేష్, ఎస్.కె. చాంద్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పోతరాజు సాయి, జడ సంతోష్, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు బత్తుల వెంకన్న, కూనూరు ముత్తయ్యతో పాటు నాయకులు కాటేపల్లి యాదయ్య, మిర్యాల మల్లేశం, బొడ్డు అల్లయ, నల్ల సైదులు, బాసాని రాజు, ఎండి మోసబ్, సుర్వి సత్తయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News