గ్రోమోర్, పిఎసిఎస్ సెంటర్లను సందర్శన వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు.
గ్రోమోర్, పిఎసిఎస్ సెంటర్లను సందర్శన వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు.
Komidala Mahender reddy
యూరియా యాప్ తో రైతుల కష్టాలు చెక్.స్థానికం ప్రతినిధి కొమిడాలమహేందర్ రెడ్డి
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ ను, పిఎసిఎస్ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరైతులకు యూరియా కష్టాలు చెక్ తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్ ద్వారా ఎలాంటి సమస్యలు ఉండవని, రైతులు యూరియా కోసం బారులు తీరిన క్యూలైన్లలో నిలబడకుండా, యూరియా కోసం పడిగాపులు కాయకుండా ఇంట్లో నుండే సులువుగా ఎరువుల కేంద్రంలో ఎంత యూరియా ఉందో తెలుసుకొని తమకు ఎంత యూరియా అవసరమో అంత యూరియాను బుక్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యూరియా యాప్ ను తీసుకు వచ్చిందని అన్నారు. దీనివల్ల రైతులకూ యూరియా కష్టాలు ఇక ఉండబోవని అన్నారు. అంతేకాకుండా యూరియా ఏ ఏ సెంటర్లలో ఎంత మొత్తం నిల్వ ఉందో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని తమకు నచ్చిన డీలర్ వద్ద నుండి యూరియాను నేరుగా పొందవచ్చునని సూచించారు. ప్రతి ఒక్క రైతు ఈ యాప్ ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారానే యూరియాను సులువుగా పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, నకరికల్ వ్యవసాయ సహాయ సంచాలకులు జానీ మియా, మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు, ఏఈఓ వాసుదేవ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి