PRINT TIME: May 26, 2026 03:11 PM
గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
May 18, 2026 07:14 PM
10 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.సోమవారం మోతే మండలంలోని మామిళ్ళగూడెంలో NHA నిధులు రూ.1.03 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంగా అన్ని మండలాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.ఆధునిక టెక్నాలజీతో ఈ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు,వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి