గ్రామీణ బాలిక నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారిగా పావని ప్రయాణం
గ్రామీణ బాలిక నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారిగా పావని ప్రయాణం
Krishna
నారాయణఖేడ్ మండలంలోని కొండాపూర్ తాండకు చెందిన నందు సింగ్ ఎక్సైజ్ శాఖలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా, వారి కుమార్తె రాథోడ్ పావని ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇన్కమ్ ట్యాక్స్ సూపరింటెండెంట్ ఉద్యోగాన్ని పొందింది. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన పావని నారాయణఖేడ్ పట్టణంలోని విజ్ఞాన్ టాలెంట్ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి వరకు చదివి, అనంతరం సంగారెడ్డిలోని సెంట్ జోన్ పాఠశాలలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతి తరగతిలోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ అనంతరం ఎంసెట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఎన్ఐటి విద్యాసంస్థలో సీటు పొందిన ఆమె అక్కడ ఉన్నత విద్యను పూర్తి చేసి, తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో పాల్గొని ప్రతిభతో ఇన్కమ్ ట్యాక్స్ సూపరింటెండెంట్గా ఎంపికైంది. గిరిజన కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న పావని విజయం పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని గిరిజన విద్యార్థులు విద్యలో ముందుకు సాగి ఉన్నత లక్ష్యాలు సాధించాలని పెద్దలు సూచిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి