Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

గ్రామీణ బాలిక నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారిగా పావని ప్రయాణం

గ్రామీణ బాలిక నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారిగా పావని ప్రయాణం

గ్రామీణ బాలిక నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారిగా పావని ప్రయాణం
April 09, 2026 05:34 PM 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండలంలోని కొండాపూర్ తాండకు చెందిన నందు సింగ్ ఎక్సైజ్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా, వారి కుమార్తె రాథోడ్ పావని ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇన్‌కమ్ ట్యాక్స్ సూపరింటెండెంట్ ఉద్యోగాన్ని పొందింది. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన పావని నారాయణఖేడ్ పట్టణంలోని విజ్ఞాన్ టాలెంట్ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి వరకు చదివి, అనంతరం సంగారెడ్డిలోని సెంట్ జోన్ పాఠశాలలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతి తరగతిలోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ అనంతరం ఎంసెట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఎన్ఐటి విద్యాసంస్థలో సీటు పొందిన ఆమె అక్కడ ఉన్నత విద్యను పూర్తి చేసి, తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో పాల్గొని ప్రతిభతో ఇన్‌కమ్ ట్యాక్స్ సూపరింటెండెంట్‌గా ఎంపికైంది. గిరిజన కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న పావని విజయం పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని గిరిజన విద్యార్థులు విద్యలో ముందుకు సాగి ఉన్నత లక్ష్యాలు సాధించాలని పెద్దలు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News