Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 07:11 PM

గ్రామీణ బాలిక నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారిగా పావని ప్రయాణం

గ్రామీణ బాలిక నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారిగా పావని ప్రయాణం

గ్రామీణ బాలిక నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారిగా పావని ప్రయాణం
April 09, 2026 05:34 PM 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండలంలోని కొండాపూర్ తాండకు చెందిన నందు సింగ్ ఎక్సైజ్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా, వారి కుమార్తె రాథోడ్ పావని ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇన్‌కమ్ ట్యాక్స్ సూపరింటెండెంట్ ఉద్యోగాన్ని పొందింది. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన పావని నారాయణఖేడ్ పట్టణంలోని విజ్ఞాన్ టాలెంట్ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి వరకు చదివి, అనంతరం సంగారెడ్డిలోని సెంట్ జోన్ పాఠశాలలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతి తరగతిలోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ అనంతరం ఎంసెట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఎన్ఐటి విద్యాసంస్థలో సీటు పొందిన ఆమె అక్కడ ఉన్నత విద్యను పూర్తి చేసి, తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో పాల్గొని ప్రతిభతో ఇన్‌కమ్ ట్యాక్స్ సూపరింటెండెంట్‌గా ఎంపికైంది. గిరిజన కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న పావని విజయం పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని గిరిజన విద్యార్థులు విద్యలో ముందుకు సాగి ఉన్నత లక్ష్యాలు సాధించాలని పెద్దలు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News