గ్రామీణ ప్రాంత మహిళల ఆరోగ్య అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమంలో ఖేఢ్ ఎమ్మెల్యే
గ్రామీణ ప్రాంత మహిళల ఆరోగ్య అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమంలో ఖేఢ్ ఎమ్మెల్యే
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలంలోని మర్డి గ్రామంలో ఈ రోజు మహిళల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షలు మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి ప్రత్యేకంగా పాల్గొని మహిళలను ప్రోత్సహించారు.నారాయణఖేడ్ ప్రాంతంలోని మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఉద్దేశించి ఈ ఉచిత పరీక్షలు మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకు సహకారంతో అమలు చేస్తున్న ఉచిత క్యాన్సర్ పరీక్షల కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరం జరిగింది.ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలకు ఉచితంగా రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి, వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలపై అవగాహన కల్పించారు. క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని డాక్టర్ సంజీవరెడ్డి మహిళలకు సూచించారు. గ్రామ గ్రామాలకు చేరుకునే విధంగా మొబైల్ వైద్య వాహనాల ద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమం ద్వారా పేదలు మరియు గ్రామీణ మహిళలకు ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయని, ప్రతి మహిళ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, క్యాన్సర్పై అవగాహన పెంచుకొని సమయానికి చికిత్స తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైద్య బృందం, యెన్నం విజయలక్ష్మి సర్పంచ్, నరసింహ రెడ్డి మాజీ సిడిసి ఛైర్మన్, మర్డి గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి