Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:50 PM

గ్రామస్తులకు మెరుగైన సేవలు అందిస్తాం : సర్పంచ్ రామావత్ భీమి బాయి

గ్రామస్తులకు మెరుగైన సేవలు అందిస్తాం : సర్పంచ్ రామావత్ భీమి బాయి

గ్రామస్తులకు మెరుగైన సేవలు అందిస్తాం : సర్పంచ్ రామావత్ భీమి బాయి
February 04, 2026 06:51 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ

రూ.20 లక్షల వ్యయంతో ఆధునిక భవనం

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల పరిధిలోని పిచెర్యాడి పాత తాండలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధుల నుంచి సుమారు రూ.20 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు.

గ్రామ సర్పంచ్ రామావత్ భీమి బాయి, భూమి అధికారులు, గ్రామస్తులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామస్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో అత్యాధునిక వసతులతో భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె. శ్వేత, పంచాయతీ రాజ్ ఏఈ శశికుమార్, కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాథోడ్ వినోద్ కుమార్, మాజీ సర్పంచ్ చవాన్ చందర్, వార్డు సభ్యులు రవీనా సంజు రాథోడ్, రామావత్ హస్లీ బాయి, చవాన్ అనూష బాయి, రామావత్ నర్సిములు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రామావత్ మంగు, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి రాథోడ్ గోపాల్, మాజీ ఎంపీటీసీ గొల్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News