Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:48 PM

గ్రామస్తులకు మెరుగైన సేవలు అందిస్తాం : సర్పంచ్ రామావత్ భీమి బాయి

గ్రామస్తులకు మెరుగైన సేవలు అందిస్తాం : సర్పంచ్ రామావత్ భీమి బాయి

గ్రామస్తులకు మెరుగైన సేవలు అందిస్తాం : సర్పంచ్ రామావత్ భీమి బాయి
February 04, 2026 06:51 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ

రూ.20 లక్షల వ్యయంతో ఆధునిక భవనం

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల పరిధిలోని పిచెర్యాడి పాత తాండలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధుల నుంచి సుమారు రూ.20 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు.

గ్రామ సర్పంచ్ రామావత్ భీమి బాయి, భూమి అధికారులు, గ్రామస్తులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామస్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో అత్యాధునిక వసతులతో భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె. శ్వేత, పంచాయతీ రాజ్ ఏఈ శశికుమార్, కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాథోడ్ వినోద్ కుమార్, మాజీ సర్పంచ్ చవాన్ చందర్, వార్డు సభ్యులు రవీనా సంజు రాథోడ్, రామావత్ హస్లీ బాయి, చవాన్ అనూష బాయి, రామావత్ నర్సిములు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రామావత్ మంగు, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి రాథోడ్ గోపాల్, మాజీ ఎంపీటీసీ గొల్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News