Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:28 PM

గ్రామస్తులకు మెరుగైన సేవలు అందిస్తాం : సర్పంచ్ రామావత్ భీమి బాయి

గ్రామస్తులకు మెరుగైన సేవలు అందిస్తాం : సర్పంచ్ రామావత్ భీమి బాయి

గ్రామస్తులకు మెరుగైన సేవలు అందిస్తాం : సర్పంచ్ రామావత్ భీమి బాయి
04-02-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ

రూ.20 లక్షల వ్యయంతో ఆధునిక భవనం

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల పరిధిలోని పిచెర్యాడి పాత తాండలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధుల నుంచి సుమారు రూ.20 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు.

గ్రామ సర్పంచ్ రామావత్ భీమి బాయి, భూమి అధికారులు, గ్రామస్తులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామస్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో అత్యాధునిక వసతులతో భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె. శ్వేత, పంచాయతీ రాజ్ ఏఈ శశికుమార్, కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాథోడ్ వినోద్ కుమార్, మాజీ సర్పంచ్ చవాన్ చందర్, వార్డు సభ్యులు రవీనా సంజు రాథోడ్, రామావత్ హస్లీ బాయి, చవాన్ అనూష బాయి, రామావత్ నర్సిములు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రామావత్ మంగు, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి రాథోడ్ గోపాల్, మాజీ ఎంపీటీసీ గొల్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామస్తులకు మెరుగైన సేవలు అందిస్తాం : సర్పంచ్ రామావత్ భీమి బాయి

Article Image

పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ

రూ.20 లక్షల వ్యయంతో ఆధునిక భవనం

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల పరిధిలోని పిచెర్యాడి పాత తాండలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధుల నుంచి సుమారు రూ.20 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు.

గ్రామ సర్పంచ్ రామావత్ భీమి బాయి, భూమి అధికారులు, గ్రామస్తులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామస్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో అత్యాధునిక వసతులతో భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె. శ్వేత, పంచాయతీ రాజ్ ఏఈ శశికుమార్, కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాథోడ్ వినోద్ కుమార్, మాజీ సర్పంచ్ చవాన్ చందర్, వార్డు సభ్యులు రవీనా సంజు రాథోడ్, రామావత్ హస్లీ బాయి, చవాన్ అనూష బాయి, రామావత్ నర్సిములు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రామావత్ మంగు, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి రాథోడ్ గోపాల్, మాజీ ఎంపీటీసీ గొల్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News