Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:16 AM

గ్రామపంచాయతీ, శ్రీ శక్తి భవనాలకు భూ విరాళం చేసిన ;రైతు హుస్సేన్

గ్రామపంచాయతీ, శ్రీ శక్తి భవనాలకు భూ విరాళం చేసిన ;రైతు హుస్సేన్

గ్రామపంచాయతీ, శ్రీ శక్తి భవనాలకు భూ విరాళం చేసిన ;రైతు హుస్సేన్
February 18, 2026 06:41 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి: గ్రామపంచాయతీ భవనం తోపాటు స్త్రీ శక్తి భవన కార్యాలయాల నిర్మాణానికి సుమారు రూ.6లక్షల రూపాయల విలువ చేసే నాలుగు గుంటల స్థలాన్ని గ్రామానికి చెందిన లకావత్ హుస్సేన్ అనే రైతు దాతృత్వంతో అందజేశారు. బుధవారం మండల పరిధిలోని గుడి తండా గ్రామంలో గ్రామ సర్పంచ్ గుగులోతు ఝాన్సీ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో గ్రామ అభివృద్ధి కోసం తన వంతు బాధ్యతగా భావించి ఈ విలువైన స్థలాన్ని విరాళంగా ఇవ్వడం గ్రామస్తుల ప్రశంసలను అందుకున్నారు.


గ్రామంలో పంచాయతీ భవనం లేకపోవడంతో అంగన్వాడి భవనంలో కొనసాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రైతు హుస్సేన్ చేసిన ఈ మహాదానం గ్రామ చరిత్రలో నిలిచిపోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజాప్రయోజనాల కోసం ముందుకొచ్చిన రైతుకు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.



ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి ముందుకు రావాలని, స్థల దాత చేసిన ఈ సేవ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పట్ల రైతు చూపిన సేవాభావం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.ఈ సమావేశంలో గ్రామ కార్యదర్శి చింత సురేష్, ఉప సర్పంచ్ గుగులోతు పద్మ, వార్డు సభ్యులు దారావత్ బుజ్జమ్మ, గుగులోతు శ్రీను, గుగులోతు సాగర్, గూగులోతు వినోద, పాతులోతు సరోజా, లకావత్ దామోదర్, లకావత్ భద్రమ్మ,గ్రామ పెద్దలు బానోతు వెంకన్న, గుగులోతు రమణ, పాతులోతు సూర్య, బానోతు భగవాన్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News