గ్రామాల అభివృద్ధికి సర్పంచుల అంకితభావ కృషి అవసరం: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
గ్రామాల అభివృద్ధికి సర్పంచుల అంకితభావ కృషి అవసరం: జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
Sthanikam District Staff Reporter krishna
పల్లెల సర్వతోముఖాభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, గ్రామాల సమగ్ర ప్రగతే లక్ష్యంగా సర్పంచులు అంకితభావంతో కృషి చేయాలని పి. ప్రావీణ్య పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని సర్పంచులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శిక్షణ ద్వారా పొందిన అవగాహనను గ్రామాల అభివృద్ధి కార్యాచరణలో సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు పారదర్శక, సమర్థవంతమైన మరియు బాధ్యతాయుత పాలన అందించడం సర్పంచుల ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను నియమ నిబంధనల ప్రకారం సక్రమంగా వినియోగిస్తూ, అన్ని వర్గాల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు.ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడమే కాకుండా, గ్రామ ప్రజల అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి తక్షణమే స్పందించాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం, అంతర్గత రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రతి గ్రామాన్ని శుభ్రంగా, ఆరోగ్యవంతంగా, అభివృద్ధి దిశగా నడిపించే బాధ్యత సర్పంచులపై ఉందని గుర్తుచేశారు.గ్రామ పంచాయతీలను ఆదర్శవంతమైన స్థానిక సంస్థలుగా తీర్చిదిద్దేందుకు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, ప్రజలతో మమేకమై పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి పాటించాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకుంటూ సమగ్ర అభివృద్ధి సాధించాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో మరియు ఇన్చార్జ్ జిల్లా పంచాయతీ అధికారి జానకి రెడ్డి, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, మాస్టర్ ట్రైనర్లు మరియు ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి