Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 27, 2026 09:56 PM

గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం – చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం – చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం – చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
March 27, 2026 08:01 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఖేడ్ మండలం అబ్బేందా గ్రామంలో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ అంబికా కిరణ్ ఆహ్వానం మేరకు ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు, తండాల అభివృద్ధికి మౌలిక వసతులు అత్యంత కీలకమని, ముఖ్యంగా రహదారులు, డ్రైనేజీ వంటి సదుపాయాలు ప్రజల రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తాయని తెలిపారు. చేపట్టిన పనులు నాణ్యతతో పాటు సమయానికి పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచిస్తూ, ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగేలా బాధ్యతతో పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉందని, గ్రామాల్లో అభివృద్ధి వేగవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, ప్రజల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, ధర్మరెడ్డి, సంగప్ప, విజయకుమార్, స్వామి, శంకర్ గౌడ్, కాశీనాథ్, నర్సన్న, పాల విఠల్, మారుతి, రాజు, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News