గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం – చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం – చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఖేడ్ మండలం అబ్బేందా గ్రామంలో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ అంబికా కిరణ్ ఆహ్వానం మేరకు ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు, తండాల అభివృద్ధికి మౌలిక వసతులు అత్యంత కీలకమని, ముఖ్యంగా రహదారులు, డ్రైనేజీ వంటి సదుపాయాలు ప్రజల రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తాయని తెలిపారు. చేపట్టిన పనులు నాణ్యతతో పాటు సమయానికి పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచిస్తూ, ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగేలా బాధ్యతతో పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉందని, గ్రామాల్లో అభివృద్ధి వేగవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, ప్రజల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, ధర్మరెడ్డి, సంగప్ప, విజయకుమార్, స్వామి, శంకర్ గౌడ్, కాశీనాథ్, నర్సన్న, పాల విఠల్, మారుతి, రాజు, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి