Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:29 AM

గ్రామాభివృద్ధికి శ్రీకారం.. సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన- సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

గ్రామాభివృద్ధికి శ్రీకారం.. సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన- సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

గ్రామాభివృద్ధికి శ్రీకారం.. సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన- సర్పంచ్ జువ్వి నర్సింహ్మ
March 31, 2026 04:03 AM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ తెలిపారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని పేర్కొన్నారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పక్కీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు సామిడి సంధ్య, ఐతరాజు శారద లింగస్వామి, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, మాజీ ఉప సర్పంచ్‌లు బత్తుల శ్రీహరి, కొంతం బుచ్చిరెడ్డి, గ్రామస్తులు ఊదరి లింగయ్య, దాసర్ల లింగయ్య, పగిళ్ళ అమర్ నాద్ రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News