గ్రామాభివృద్ధికి శ్రీకారం.. సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన- సర్పంచ్ జువ్వి నర్సింహ్మ
గ్రామాభివృద్ధికి శ్రీకారం.. సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన- సర్పంచ్ జువ్వి నర్సింహ్మ
K.RAVI
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ తెలిపారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని పేర్కొన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పక్కీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు సామిడి సంధ్య, ఐతరాజు శారద లింగస్వామి, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, మాజీ ఉప సర్పంచ్లు బత్తుల శ్రీహరి, కొంతం బుచ్చిరెడ్డి, గ్రామస్తులు ఊదరి లింగయ్య, దాసర్ల లింగయ్య, పగిళ్ళ అమర్ నాద్ రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి