Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:17 AM

గ్రామాభివృద్ధికి పాటుపడతా: కన్నె కంటి వెంకటేశ్వరాచారి

గ్రామాభివృద్ధికి పాటుపడతా: కన్నె కంటి వెంకటేశ్వరాచారి

గ్రామాభివృద్ధికి పాటుపడతా: కన్నె కంటి వెంకటేశ్వరాచారి
13-12-2025 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నీతివంతమైన పాలనతో గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని బీజేపీ బలపరిచిన మునిపంపుల సర్పంచ్ అభ్యర్థి కన్నె కంటి వెంకటేశ్వరాచారి స్పష్టం చేశారు. శుక్రవారం మునిపంపుల గ్రామంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయాలనే స్పష్టమైన సంకల్పంతోనే ఎన్నికల బరిలోకి దిగానని, ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే పాలకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. ప్రతి సమస్యపై వెంటనే స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా వీధిదీపాల నిర్వహణను పటిష్టం చేసి గ్రామాన్ని వెలుగులతో నింపుతామని, సురక్షితమైన మంచినీటి సరఫరాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ‘ఉంగరం’ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

Sthanikam

గ్రామాభివృద్ధికి పాటుపడతా: కన్నె కంటి వెంకటేశ్వరాచారి

Article Image
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నీతివంతమైన పాలనతో గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని బీజేపీ బలపరిచిన మునిపంపుల సర్పంచ్ అభ్యర్థి కన్నె కంటి వెంకటేశ్వరాచారి స్పష్టం చేశారు. శుక్రవారం మునిపంపుల గ్రామంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయాలనే స్పష్టమైన సంకల్పంతోనే ఎన్నికల బరిలోకి దిగానని, ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే పాలకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. ప్రతి సమస్యపై వెంటనే స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా వీధిదీపాల నిర్వహణను పటిష్టం చేసి గ్రామాన్ని వెలుగులతో నింపుతామని, సురక్షితమైన మంచినీటి సరఫరాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ‘ఉంగరం’ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News