Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:53 AM

గ్రామ సర్పంచుల హక్కులను సాధిద్దాం...

గ్రామ సర్పంచుల హక్కులను సాధిద్దాం...

గ్రామ సర్పంచుల హక్కులను సాధిద్దాం...
March 26, 2026 05:36 AM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

దేశ ప్రగతిలో సర్పంచుల భాగస్వామ్యం వెలకట్టలేనిది

జిల్లా సర్పంచుల పోరం అధ్యక్షుడిగా కొప్పుల వెంకటరెడ్డి నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ తేలంగాణ రాష్ట్రంలోని నూతన గ్రామపంచాయతీ సర్పంచులుగా ఎన్నికైన సర్పంచుల సమస్యల పరిష్కారానికి వారి హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ అన్నారు.

బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక వివేరా హోటల్లో జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహులు జిల్లా గ్రామ సర్పంచులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ మాట్లాడుతూ... గాంధీజీ కలని కన్నా స్వరాజ్యం సాధించడానికి గ్రామ పౌరులు సర్పంచుల ద్వారానే సాధ్యమవుతుందని ఆనాడే మహాత్మా గాంధీ బోధించారని అన్నారు.

నేడు వారి ఆశయ సాధనకు పాటుపడుతున్న సర్పంచ్లకు అనేక సమస్యలతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని గ్రామాలకు ఎన్నికైన సర్పంచులు గ్రామంలోని ప్రజా సమస్యలతో పాటు గ్రామ అభివృద్ధికి సంక్షేమానికి 24 గంటలు కృషి చేస్తున్న సర్పంచుల వేతనాలను 6500 నుండి 25 వేల వరకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు పాటు గ్రామాలలోని సొంత గ్రామ పనులు నిధులను కూడా ఫ్రిజ్ చేయడం సరికాదని అన్నారు. వెంటనే ఫ్రీజ్ నుంచి తొలగించాలని ఆయన కోరారు.గ్రామ సర్పంచులు ప్రజాసేవలో మంచి గుర్తింపు తీసుకొచ్చి గ్రామాలకు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. అనంతరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ సమక్షంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా కొప్పుల వెంకటరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలుగా టేకు మంజుల, ప్రధాన కార్యదర్శిగా గిరి కంటి నిరంజన్ గౌడ్ ఉపాధ్యక్షులుగా తాండ్రా నారాయణస్వామి,జెన్నా సిద్ధులు,ఇటమోని గీతా యాదవ్, కార్యదర్శిగా చిన్నం బీరప్ప, ప్రచార కార్యదర్శి భూక్య రాజారాం నాయక్ సహాయ కార్యదర్శి ఒగ్గు రవళి రాణా ప్రతాప్ కోశాధికారిగా కాసులు అంజయ్య. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు కొప్పుల వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు,కమిటీకి జిల్లా సర్పంచులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సర్పంచుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అండగా ఉంటానని సర్పంచ్ హక్కుల సాధనకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్,సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి కీర్తి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి అవినాష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహులు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సుర్వి మల్లేష్ గౌడ్,రాష్ట్ర సలహాదారులు రవీందర్ యాదవ్,జిల్లాలోని వివిధ మండల ఫోరం అధ్యక్షులు,వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News