Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పార్ట్ టైమ్‌గా మొదలుపెట్టి ఫుల్ టైమ్ ఆదాయం సాధ్యం:వేస్టేజ్ సంస్థ వంటి డైరెక్ట్ సెల్లింగ్ లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 08:17 AM

గ్రామ సర్పంచుల హక్కులను సాధిద్దాం...

గ్రామ సర్పంచుల హక్కులను సాధిద్దాం...

గ్రామ సర్పంచుల హక్కులను సాధిద్దాం...
March 26, 2026 05:36 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

దేశ ప్రగతిలో సర్పంచుల భాగస్వామ్యం వెలకట్టలేనిది

జిల్లా సర్పంచుల పోరం అధ్యక్షుడిగా కొప్పుల వెంకటరెడ్డి నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ తేలంగాణ రాష్ట్రంలోని నూతన గ్రామపంచాయతీ సర్పంచులుగా ఎన్నికైన సర్పంచుల సమస్యల పరిష్కారానికి వారి హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ అన్నారు.

బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక వివేరా హోటల్లో జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహులు జిల్లా గ్రామ సర్పంచులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ మాట్లాడుతూ... గాంధీజీ కలని కన్నా స్వరాజ్యం సాధించడానికి గ్రామ పౌరులు సర్పంచుల ద్వారానే సాధ్యమవుతుందని ఆనాడే మహాత్మా గాంధీ బోధించారని అన్నారు.

నేడు వారి ఆశయ సాధనకు పాటుపడుతున్న సర్పంచ్లకు అనేక సమస్యలతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని గ్రామాలకు ఎన్నికైన సర్పంచులు గ్రామంలోని ప్రజా సమస్యలతో పాటు గ్రామ అభివృద్ధికి సంక్షేమానికి 24 గంటలు కృషి చేస్తున్న సర్పంచుల వేతనాలను 6500 నుండి 25 వేల వరకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు పాటు గ్రామాలలోని సొంత గ్రామ పనులు నిధులను కూడా ఫ్రిజ్ చేయడం సరికాదని అన్నారు. వెంటనే ఫ్రీజ్ నుంచి తొలగించాలని ఆయన కోరారు.గ్రామ సర్పంచులు ప్రజాసేవలో మంచి గుర్తింపు తీసుకొచ్చి గ్రామాలకు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. అనంతరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ సమక్షంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా కొప్పుల వెంకటరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలుగా టేకు మంజుల, ప్రధాన కార్యదర్శిగా గిరి కంటి నిరంజన్ గౌడ్ ఉపాధ్యక్షులుగా తాండ్రా నారాయణస్వామి,జెన్నా సిద్ధులు,ఇటమోని గీతా యాదవ్, కార్యదర్శిగా చిన్నం బీరప్ప, ప్రచార కార్యదర్శి భూక్య రాజారాం నాయక్ సహాయ కార్యదర్శి ఒగ్గు రవళి రాణా ప్రతాప్ కోశాధికారిగా కాసులు అంజయ్య. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు కొప్పుల వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు,కమిటీకి జిల్లా సర్పంచులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సర్పంచుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అండగా ఉంటానని సర్పంచ్ హక్కుల సాధనకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్,సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి కీర్తి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి అవినాష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహులు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సుర్వి మల్లేష్ గౌడ్,రాష్ట్ర సలహాదారులు రవీందర్ యాదవ్,జిల్లాలోని వివిధ మండల ఫోరం అధ్యక్షులు,వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News