గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
Biksham Goud
జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా
తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిర్వహించిన నిరసనలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెరుమాళ్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు బకాయి ఉన్నాయని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బహుళ విధుల విధానాన్ని రద్దు చేసి, కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని తెలిపారు.
అదేవిధంగా కార్మికులకు వేతనాలు ప్రత్యేక మార్గం ద్వారా నేరుగా చెల్లించే విధానం అమలు చేయాలని, పది లక్షల రూపాయల భీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి