Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:46 PM

గ్రామ జీవనాధారమైన చెరువును కాపాడాలి – తహసిల్దార్‌కు వినతిపత్రం

గ్రామ జీవనాధారమైన చెరువును కాపాడాలి – తహసిల్దార్‌కు వినతిపత్రం

గ్రామ జీవనాధారమైన చెరువును కాపాడాలి – తహసిల్దార్‌కు వినతిపత్రం
February 02, 2026 06:44 PM 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని పిచేర్యాగడి పాత తాండ గ్రామ శివారులో ఉన్న సర్వే నంబర్–100 నరసింహారెడ్డి చెరువుపై జరిగిన అక్రమ ఆక్రమణలను వెంటనే తొలగించి, చెరువును అసలు విస్తీర్ణంలో పునరుద్ధరించాలని తాండ సర్పంచ్ రామావత్ భీమి బాయి సోమవారం కోహిర్ తహసిల్దార్ సుప్రియకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామానికి జీవనాధారంగా ఉన్న నరసింహారెడ్డి చెరువు గతంలో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండేదని, అయితే అక్రమ ఆక్రమణల కారణంగా ప్రస్తుతం దాని విస్తీర్ణం సుమారు 7 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. చెరువు విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల వర్షాకాలంలో సరైన నీటి నిల్వలు లేకపోతుండటంతో పాటు భూగర్భ జలాలపై, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.గ్రామ ప్రజలకు తాగునీరు, సాగునీటి అవసరాలతో పాటు పశుపోషణకు ఎంతో కీలకమైన ఈ చెరువును కాపాడుకోవడం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా సమగ్ర విచారణ చేపట్టి, చెరువుపై జరిగిన అన్ని అక్రమ ఆక్రమణలను పూర్తిగా తొలగించి, నరసింహారెడ్డి చెరువును అసలు విస్తీర్ణంలో పునరుద్ధరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు రాథోడ్ వినోద్ కుమార్ పాల్గొని సర్పంచ్ వినతికి మద్దతు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News