గ్రామ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
గ్రామ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో శంకరంపేట్ మండలంలోని చిలపల్లి గ్రామంలో నూతన మత్స్య పరిశ్రమిక సహకార సంఘాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన మరియు స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. చిలపల్లి గ్రామంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ఉండి మత్స్య వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, గ్రామ పెద్దలు మరియు యువత మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయాలని కోరడంతో ప్రత్యేక చొరవ తీసుకుని ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంఘం ద్వారా ప్రభుత్వ పథకాలు సులభంగా అందడంతో పాటు చేపల పెంపకం, మార్కెటింగ్ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మత్స్యకారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి గ్రామ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి వర్గ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాల సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం గ్రామీణ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మత్స్యకార సంఘ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి