Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:45 PM

గర్భిణికి తప్పిన గండం.. యశోద వైద్యుల అద్భుతం!

గర్భిణికి తప్పిన గండం.. యశోద వైద్యుల అద్భుతం!

గర్భిణికి తప్పిన గండం.. యశోద వైద్యుల అద్భుతం!
May 22, 2026 04:37 PM 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అత్యంత అరుదైన 'ప్లాసెంటా పెర్క్రిటా'కు విజయవంతంగా చికిత్స

ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ గర్భిణికి మలక్‌పేట యశోద ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. వైద్య శాస్త్రంలోనే అత్యంత క్లిష్టమైనదిగా భావించే 'ప్లాసెంటా పెర్క్రిటా' (మాయ గర్భాశయ గోడలను చీల్చుకుని బయటకు రావడం) సమస్యతో పోరాడుతున్న బాధితురాలిని మల్టీ డిసిప్లినరీ బృందం సమన్వయంతో కాపాడింది.​నగరానికి చెందిన 27 ఏళ్ల మహిళ (28 వారాల గర్భిణి) తీవ్రమైన కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోయే స్థితిలో ఆసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భాశయం చిట్లిపోయిందని (Uterine Rupture), కడుపులో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం జరుగుతోందని గుర్తించారు. రక్తపోటు పడిపోయి బాధితురాలు అప్పటికే 'హెమరేజిక్ షాక్'లోకి వెళ్లడంతో పరిస్థితి విషమంగా మారింది.​ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టరు ఎం.వి. జ్యోత్స్న ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్, అనస్థీషియా నిపుణుల బృందం రంగంలోకి దిగింది. శస్త్రచికిత్స సమయంలో ఆమె కడుపులో సుమారు 3 లీటర్ల రక్తం గడ్డకట్టి ఉండటాన్ని గమనించారు.​గర్భాశయానికి ఎడమవైపున 4 \ 4 సెం.మీ రంధ్రం పడింది. వైద్యులు వెంటనే లాపరోటమీ నిర్వహించి, రక్తస్రావాన్ని అదుపులోకి తెచ్చారు. రక్తం, ప్లాస్మా, ప్లేట్‌లెట్లను ఎక్కించి బాధితురాలి ప్రాణాలను నిలబెట్టారు.

పునర్జన్మ ప్రసాదించారు..

శస్త్రచికిత్స అనంతరం ఐసీయూలో నిరంతర పర్యవేక్షణతో బాధితురాలు వేగంగా కోలుకున్నారు. "ఇలాంటి కేసుల్లో నిమిషాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడం కీలకం. సరైన సమయంలో రోగ నిర్ధారణ చేసి చికిత్స అందించడం వల్లే ప్రాణాపాయం తప్పింది" అని డాక్టర్ జ్యోత్స్న పేర్కొన్నారు. అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందించి బాధితురాలిని కాపాడిన వైద్య బృందాన్ని యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ గోరంట్ల రావు అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News