గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ షబానా అజీమ్
గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ షబానా అజీమ్
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం 'ఆరోగ్య లక్ష్మి' కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ షబానాఅజీమ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆరోగ్య లక్ష్మి' పథకం కింద ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ, బాలింత అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పోషక విలువలతో కూడిన భోజనాన్ని తీసుకోవాలని కోరారు. తద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరి పేర్లను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయించాలి అని తెలిపారు.అంగన్వాడీల్లో నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యతో పాటు, బలమైన పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలోని చిన్న పిల్లలకు కౌన్సిలర్ చేతుల మీదుగా పండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎన్. సునీత, అంగన్వాడీ టీచర్ కె. మమత, ఆయా జహేదా, అలాగే వార్డులోని గర్భిణీలు, బాలింతలు , మహిళలు తదితరులు పాల్గొన్నార

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి