Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ షబానా అజీమ్ “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 04:01 PM

గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ షబానా అజీమ్

గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ షబానా అజీమ్

గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ షబానా అజీమ్
April 08, 2026 02:16 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం 'ఆరోగ్య లక్ష్మి' కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ షబానాఅజీమ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆరోగ్య లక్ష్మి' పథకం కింద ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ, బాలింత అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి పోషక విలువలతో కూడిన భోజనాన్ని తీసుకోవాలని కోరారు. తద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరి పేర్లను తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేయించాలి అని తెలిపారు.అంగన్‌వాడీల్లో నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యతో పాటు, బలమైన పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలోని చిన్న పిల్లలకు కౌన్సిలర్ చేతుల మీదుగా పండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎన్. సునీత, అంగన్‌వాడీ టీచర్ కె. మమత, ఆయా జహేదా, అలాగే వార్డులోని గర్భిణీలు, బాలింతలు , మహిళలు తదితరులు పాల్గొన్నార

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News