PRINT TIME: March 10, 2026 01:10 AM
గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం
గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం
March 09, 2026 08:18 PM
33 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీల కోసం గత 7 సంవత్సరాలు 3 నెలలుగా పౌష్టికాహారం మరియు ఉచిత అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది.
ఈ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు ప్రేమతో భోజనం వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి