PRINT TIME: May 12, 2026 05:25 PM
గర్భిణీ స్త్రీలకు దివ్య ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం
గర్భిణీ స్త్రీలకు దివ్య ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం
May 12, 2026 03:14 PM
11 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
పరిగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు నిర్వహించే ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 90మంది గర్భిణీ స్త్రీలు ఇతరులు 20మంది కి దివ్య ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత , హైకోర్టు అడ్వకేట్ మరియు బిజెపి నాయకులు పరిగి వేణుగోపాల్ రావు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2018 సంవత్సరం నుండి తన కూతురు దివ్య పేరున దివ్య ఎడుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్టు స్థాపించి భోజనాలు కల్పించామని ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని అలాగే, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందం మరియు వేణుగోపాల్ రావు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి