Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:17 AM

గ్రామాల అభివృద్ధే లక్ష్యం – నూతన ప్రజాప్రతినిధులకు భూపాల్‌రెడ్డి దిశానిర్దేశం

గ్రామాల అభివృద్ధే లక్ష్యం – నూతన ప్రజాప్రతినిధులకు భూపాల్‌రెడ్డి దిశానిర్దేశం

గ్రామాల అభివృద్ధే లక్ష్యం – నూతన ప్రజాప్రతినిధులకు భూపాల్‌రెడ్డి దిశానిర్దేశం
19-12-2025 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నారాయణఖేడ్‌లో బీఆర్‌ఎస్ విజేతలకు ఘన సన్మానం

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి:

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఘన సన్మానం జరిగింది. నారాయణఖేడ్ బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విజేతలను శాలువాలతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శక పాలన అందించాలని నూతన ప్రజాప్రతినిధులకు సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీపై ప్రజలు చూపిన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. నారాయణఖేడ్‌లో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

Sthanikam

గ్రామాల అభివృద్ధే లక్ష్యం – నూతన ప్రజాప్రతినిధులకు భూపాల్‌రెడ్డి దిశానిర్దేశం

Article Image

నారాయణఖేడ్‌లో బీఆర్‌ఎస్ విజేతలకు ఘన సన్మానం

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి:

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఘన సన్మానం జరిగింది. నారాయణఖేడ్ బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విజేతలను శాలువాలతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శక పాలన అందించాలని నూతన ప్రజాప్రతినిధులకు సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీపై ప్రజలు చూపిన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. నారాయణఖేడ్‌లో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News