గ్రామాల అభివృద్ధే లక్ష్యం – నూతన ప్రజాప్రతినిధులకు భూపాల్రెడ్డి దిశానిర్దేశం
గ్రామాల అభివృద్ధే లక్ష్యం – నూతన ప్రజాప్రతినిధులకు భూపాల్రెడ్డి దిశానిర్దేశం
Editor Desk
నారాయణఖేడ్లో బీఆర్ఎస్ విజేతలకు ఘన సన్మానం
సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి:
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులకు ఘన సన్మానం జరిగింది. నారాయణఖేడ్ బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విజేతలను శాలువాలతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శక పాలన అందించాలని నూతన ప్రజాప్రతినిధులకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు చూపిన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. నారాయణఖేడ్లో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి