Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:46 PM

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
December 19, 2025 02:05 PM 160 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన 166 మంది సర్పంచులకు ఘన సన్మానం

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్ / సంగారెడ్డి జిల్లా: స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన 166 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ఘన సన్మానం నిర్వహించారు.

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి విజేతలకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శక పాలన అందించాలని హితవు పలికారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News