Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:15 AM

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
19-12-2025 175 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన 166 మంది సర్పంచులకు ఘన సన్మానం

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్ / సంగారెడ్డి జిల్లా: స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన 166 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ఘన సన్మానం నిర్వహించారు.

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి విజేతలకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శక పాలన అందించాలని హితవు పలికారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన 166 మంది సర్పంచులకు ఘన సన్మానం

గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్ / సంగారెడ్డి జిల్లా: స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన 166 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ఘన సన్మానం నిర్వహించారు.

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి విజేతలకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శక పాలన అందించాలని హితవు పలికారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News