గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Editor Desk
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన 166 మంది సర్పంచులకు ఘన సన్మానం
గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్ / సంగారెడ్డి జిల్లా: స్థానిక ప్రతినిధి
నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన 166 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ఘన సన్మానం నిర్వహించారు.
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి విజేతలకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శక పాలన అందించాలని హితవు పలికారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి