గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో భూస మల్లయ్య
గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో భూస మల్లయ్య
స్థానికం బృందం
ప్రజాసేవ కోసమే 20 ఏళ్ల రాజకీయ ప్రయాణం
ఆర్మూర్, స్థానికం ప్రతినిధి
లాభాపేక్ష లేకుండా గత 20 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నానని, గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ బరిలో నిలిచానని మంథని గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భూస మల్లయ్య తెలిపారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎంపీటీసీగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ ఆర్థిక నష్టాన్ని చవిచూసినా ప్రజాసేవకు వెనకడుగు వేయలేదని అన్నారు. పదవులు ఉన్నవారికే అవకాశాలు వస్తాయా..? సామాన్యుడికి అవకాశం లేదా..? అన్న ఆవేదన తనలో ఎన్నోసార్లు కలిగిందని, అయినా గ్రామానికి సేవ చేయాలన్న తపనతో ముందుకు వచ్చానని పేర్కొన్నారు.
గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన ఏకైక లక్ష్యమని, ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందిస్తానని హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్గా అవకాశం కల్పిస్తే, గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని భూస మల్లయ్య ప్రజలను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి