గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
స్థానికం బృందం
రామన్నపేట మండలంలో సర్పంచులు, నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
స్థానికం ప్రతినిధి : కొండ మల్లేశం గౌడ్
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేట మండలం తుమలగూడెం గ్రామ సర్పంచ్ గర్దాసు విక్రమ్, బోగారం గ్రామ సర్పంచ్ కునురీ సాయి కుమార్ గౌడ్, సిరిపురం గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్, పల్లివాడ గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్, కుంకుడుపముల గ్రామ సర్పంచ్ గొలుసుల సత్తయ్యతో పాటు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై, ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేసి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా బాధ్యతతో వ్యవహరించి, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి