గ్రామాభివృద్ధే లక్ష్యం – ఏకగ్రీవ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మందడి ప్రభాకర్ రెడ్డి
గ్రామాభివృద్ధే లక్ష్యం – ఏకగ్రీవ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మందడి ప్రభాకర్ రెడ్డి
స్థానికం బృందం
సర్పంచ్ నారపాక మాధవి యాదయ్యకు ఘన సన్మానం
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ నారపాక మాధవి యాదయ్యను శాలువాతో సత్కరించి సారీ నిబహుకరించి అభినందనలు తెలిపారు.
ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా నూతన పాలకమండలి సభ్యులను కూడా ఘనంగా సన్మానించి, గ్రామ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలోహాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య మాట్లాడుతూ… గ్రామం ఏకగ్రీవంగా నిలవడానికి, తన విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఐక్యత, సహకారం ఉంటేనే నిదానపల్లి మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి