గొట్టే కళావతి దశదినకర్మకు నేతల నివాళులు
గొట్టే కళావతి దశదినకర్మకు నేతల నివాళులు
Biksham
మల్లన్న నగర్లో హుజూర్నగర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ గొట్టే రామయ్య సతీమణి గొట్టే కళావతి దశదినకర్మ కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్ మాట్లాడుతూ, గొట్టే కళావతి మరణం కుటుంబానికి తీరని లోటు అని పేర్కొంటూ, ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో హుజూర్నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు, హుజూర్నగర్ మాజీ ఎంపీపీ గూడెపు శ్రీను, హుజూర్నగర్ గ్రంథాలయం మాజీ చైర్మన్ ఇట్టి మల్ల బెంజిమెన్, గోవిందపురం ఎంపీటీసీ శ్రీను, ఐ ఎన్ టి యు సి హుజూర్నగర్ మండల అధ్యక్షులు మేళ్లచెరువు ముక్కంటి తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి