PRINT TIME: May 26, 2026 08:31 PM
గొరిగే నరసింహకు దైద రవీందర్ శ్రద్ధాంజలి
గొరిగే నరసింహకు దైద రవీందర్ శ్రద్ధాంజలి
December 26, 2025 03:12 PM
80 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి
నకిరేకల్ నియోజకవర్గంరామన్నపేట మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ, కార్మిక సంఘ నాయకుడు గొరిగే నరసింహ మృతిచెందడంతో ఆయన మృతదేహానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ… కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా గొరిగే నరసింహ సేవలు మరువలేనివని అన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసిన ఆయన జీవితాన్ని స్మరించుకున్నారు.
ఈ నివాళి కార్యక్రమంలో గుండాల నర్సింహ, గుండాల సతీష్, యాదయ్య, గుండాల రమేష్, మహేశ్, రాజు తదితరులు పాల్గొని గొరిగే నరసింహకు శ్రద్ధాంజలి ఘటించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి