రామన్నపేట స్థానికం ప్రతినిధి
నకిరేకల్ నియోజకవర్గంరామన్నపేట మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ, కార్మిక సంఘ నాయకుడు గొరిగే నరసింహ మృతిచెందడంతో ఆయన మృతదేహానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ… కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా గొరిగే నరసింహ సేవలు మరువలేనివని అన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసిన ఆయన జీవితాన్ని స్మరించుకున్నారు.
ఈ నివాళి కార్యక్రమంలో గుండాల నర్సింహ, గుండాల సతీష్, యాదయ్య, గుండాల రమేష్, మహేశ్, రాజు తదితరులు పాల్గొని గొరిగే నరసింహకు శ్రద్ధాంజలి ఘటించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి