PRINT TIME: February 24, 2026 03:06 AM
గొరిగే నరసింహకు చిరుమర్తి లింగయ్య శ్రద్ధాంజలి
గొరిగే నరసింహకు చిరుమర్తి లింగయ్య శ్రద్ధాంజలి
December 26, 2025 03:18 PM
186 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
మెండే హనుమంతుకు నివాళులు
రామన్నపేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట మండలం మాజీ ఎంపీటీసీ–1గా పనిచేసిన గొరిగే నరసింహ ఆకస్మికంగా మృతిచెందడంతో ఆయన పార్థివ దేహాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
అనంతరం చిట్యాల ఆంధ్రజ్యోతి ప్రతినిధి మెండే వెంకన్న తండ్రి మెండే హనుమంతు మృతిచెందడంతో ఆయన పార్థివ దేహానికి కూడా చిరుమర్తి లింగయ్య నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఈ కఠిన సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ రెండు సంఘటనలతో రామన్నపేట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి