గొరిగే నరసింహ మృతి హమాలీ ఉద్యమానికి తీరని లోటు: ఎండీ ఇమ్రాన్
గొరిగే నరసింహ మృతి హమాలీ ఉద్యమానికి తీరని లోటు: ఎండీ ఇమ్రాన్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట మాజీ ఎంపీటీసీ, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొరిగే నరసింహ మృతి హమాలీ సంఘానికి తీరని లోటని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ అన్నారు. ఆదివారం రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన గొరిగే నరసింహ దశదిన కర్మలో సీపీఐ–ఏఐటీయూసీ నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఎండీ ఇమ్రాన్ మాట్లాడుతూ, మధ్యతరగతి కుటుంబానికి చెందిన గొరిగే నరసింహ గత 30 సంవత్సరాలుగా సివిల్ సప్లై కార్పొరేషన్లో హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడంతో పాటు, హమాలీ సంఘ నాయకుడిగా అనేక ఉద్యమాలు, పోరాటాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. రామన్నపేటలో ఎంపీటీసీగా ప్రజాసేవ చేస్తూ అన్ని వర్గాల ఆదరణ పొందారని తెలిపారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఉట్కూరి నరసింహ, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు బత్తుల సత్యం, ప్రధాన కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు పాపగళ్ల శంకరయ్య, గొరిగే శంకరయ్య, పురుగుల రవి, స్వామి, అంజయ్య, పురుగుల శ్రీను, రవి, మహేష్, రమేష్, జీడయ్య, నగేష్, బాలరాజు, ఉప్పలయ్య తదితర హమాలీ నాయకులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి