Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:02 AM

గోరిగే నర్సింహకి ఘన నివాళి

గోరిగే నర్సింహకి ఘన నివాళి

గోరిగే నర్సింహకి ఘన నివాళి
December 26, 2025 01:30 PM 131 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

గోరిగే నర్సింహకి ఘన నివాళి

శ్రద్ధాంజలి ఘటించిన రైతు సంఘం నేత మేక అశోక్ రెడ్డి

రామన్నపేట ప్రతినిధి:

కార్మిక ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ నాయకుడు గోరిగే నర్సింహ చిత్రపటానికి రాష్ట్ర రైతు సంఘం నాయకులు మేక అశోక్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం గోరిగే నర్సింహ చేసిన పోరాటాలు కార్మిక ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. శ్రమజీవుల సమస్యలను ఉద్యమంగా మలిచిన నాయకుడిగా ఆయన సేవలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి యువతకు దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు.

ఈ నివాళి కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు, యువ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గోరిగే నర్సింహ భౌతిక దేహానికిపూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్మికులు–రైతుల ఐక్యత కోసం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నేతలు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News