Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:46 AM

గోరిగే నర్సింహకి ఘన నివాళి

గోరిగే నర్సింహకి ఘన నివాళి

గోరిగే నర్సింహకి ఘన నివాళి
26-12-2025 148 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గోరిగే నర్సింహకి ఘన నివాళి

శ్రద్ధాంజలి ఘటించిన రైతు సంఘం నేత మేక అశోక్ రెడ్డి

రామన్నపేట ప్రతినిధి:

కార్మిక ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ నాయకుడు గోరిగే నర్సింహ చిత్రపటానికి రాష్ట్ర రైతు సంఘం నాయకులు మేక అశోక్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం గోరిగే నర్సింహ చేసిన పోరాటాలు కార్మిక ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. శ్రమజీవుల సమస్యలను ఉద్యమంగా మలిచిన నాయకుడిగా ఆయన సేవలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి యువతకు దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు.

ఈ నివాళి కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు, యువ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గోరిగే నర్సింహ భౌతిక దేహానికిపూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్మికులు–రైతుల ఐక్యత కోసం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నేతలు పిలుపునిచ్చారు.

Sthanikam

గోరిగే నర్సింహకి ఘన నివాళి

Article Image

గోరిగే నర్సింహకి ఘన నివాళి

శ్రద్ధాంజలి ఘటించిన రైతు సంఘం నేత మేక అశోక్ రెడ్డి

రామన్నపేట ప్రతినిధి:

కార్మిక ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ నాయకుడు గోరిగే నర్సింహ చిత్రపటానికి రాష్ట్ర రైతు సంఘం నాయకులు మేక అశోక్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం గోరిగే నర్సింహ చేసిన పోరాటాలు కార్మిక ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. శ్రమజీవుల సమస్యలను ఉద్యమంగా మలిచిన నాయకుడిగా ఆయన సేవలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి యువతకు దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు.

ఈ నివాళి కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు, యువ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గోరిగే నర్సింహ భౌతిక దేహానికిపూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్మికులు–రైతుల ఐక్యత కోసం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నేతలు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News