గొల్లగూడ పీఏసీఎస్ ఛైర్మన్కు ఘన సన్మానం
గొల్లగూడ పీఏసీఎస్ ఛైర్మన్కు ఘన సన్మానం
NM Yadav
నల్గొండ : గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఛైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆలకుంట్ల నాగరత్నం రాజుకు గురువారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఘనంగా సన్మానం జరిగింది. నల్గొండ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జూకూరి రమేష్, తిప్పర్తి పీఏసీఎస్ ఛైర్మన్ పాశం సంపత్ రెడ్డి, రాయినీగూడెం సర్పంచ్ బొంత రాములు ఆయనను శాలువా కప్పి, పూలమాలలతో గౌరవించారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి..
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ జూకూరి రమేష్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎస్ ఛైర్మన్ల పదవీకాలాన్ని పొడిగించడం శుభపరిణామమని, ఇది పాలకవర్గాలపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో గొల్లగూడ పరిధిలోని రైతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో రైతులకు అగ్రపీఠం వేస్తోందని ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత సహకార సంఘాలపై ఉందన్నారు. ప్రస్తుత సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఛైర్మన్ను కోరారు. ముఖ్యంగా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో సొమ్ము అందేలా పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ కార్యాలయ సిబ్బంది, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి