Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌గా టి.ఎల్. సంగీత పదవీ బాధ్యతలు స్వీకారం పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం பதவியேற்கும் முன்பே விஜய் அதிரடி தீர்மானம்! డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 07:03 PM

గొల్లగూడ పీఏసీఎస్ ఛైర్మన్‌కు ఘన సన్మానం

గొల్లగూడ పీఏసీఎస్ ఛైర్మన్‌కు ఘన సన్మానం

గొల్లగూడ పీఏసీఎస్ ఛైర్మన్‌కు ఘన సన్మానం
May 06, 2026 05:59 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్గొండ : గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆలకుంట్ల నాగరత్నం రాజుకు గురువారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఘనంగా సన్మానం జరిగింది. నల్గొండ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జూకూరి రమేష్, తిప్పర్తి పీఏసీఎస్ ఛైర్మన్ పాశం సంపత్ రెడ్డి, రాయినీగూడెం సర్పంచ్ బొంత రాములు ఆయనను శాలువా కప్పి, పూలమాలలతో గౌరవించారు.

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి..

​ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ జూకూరి రమేష్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎస్ ఛైర్మన్ల పదవీకాలాన్ని పొడిగించడం శుభపరిణామమని, ఇది పాలకవర్గాలపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో గొల్లగూడ పరిధిలోని రైతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో రైతులకు అగ్రపీఠం వేస్తోందని ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత సహకార సంఘాలపై ఉందన్నారు. ప్రస్తుత సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఛైర్మన్‌ను కోరారు. ముఖ్యంగా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో సొమ్ము అందేలా పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ కార్యాలయ సిబ్బంది, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News