Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:17 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
January 20, 2026 04:05 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అట్టహాసంగా నిర్వహించాలి – మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు

స్థానికం ప్రతినిధి

గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మెదక్ పోలీస్ పరేడ్ మైదానంలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వేడుకలు అట్టహాసంగా జరిగేలా చూడాలని సూచించారు. జిల్లాలో వివిధ వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉత్తమంగా విధులు నిర్వహించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేందుకు శాఖల వారీగా పరిమితితో కూడిన ప్రతిపాదనలు పంపాలని, సమర్థవంతంగా పనిచేసిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ పేర్లను సిఫారసు చేయాలని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచాలని అగ్నిమాపక శాఖకు, అంబులెన్స్‌తో పాటు ప్రథమ చికిత్స సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నాగేష్, అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు, మెదక్ ఆర్డీవో రమాదేవి సహా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News