గణతంత్ర దినోత్సవ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి..
గణతంత్ర దినోత్సవ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి..
Biksham
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
ఈ సంవత్సరం జనవరి, 26 న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ విసి హాల్ నందు జిల్లా అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ ముఖ్యఅతిథి సందేశానికి శాఖల అభివృద్ధి కార్యక్రమాల నివేదికలను పంపించాలని, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులచే సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, వివిధ శాఖల అభివృద్ధి తెలిపే విధంగా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని జిల్లా స్థాయి కార్యక్రమం ప్రారంభానికి ముందే మండల, గ్రామస్థాయిలో కార్యక్రమాన్ని ముగించుకొని జిల్లా స్థాయి కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె నరసింహ, అదనపు కలెక్టర్ కె సీతారామారావు, సిపిఓ కిషన్ నాయక్, డిఇఓ అశోక్, డిపిఓ యాదగిరి, ఇన్చార్జ్ డి ఆర్ డి ఏ పి డి శిరీష జిల్లా అధికారులు అందరూ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి