గణపనేనివారిగూడెంలొ తహసిల్దార్ నజీముల్లాషా ఆధ్వర్యంలొ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం
గణపనేనివారిగూడెంలొ తహసిల్దార్ నజీముల్లాషా ఆధ్వర్యంలొ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గణపనేనివారిగూడెంలొ తహసిల్దార్ నజీముల్లాషా ఆధ్వర్యంలొ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి నూజివీడు సబ్ కలెక్టర్ ,వినూత్న, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హాజరయ్యారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధునాతన ఫీచర్స్ తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందిస్తుందని అన్నారు. లక్ష్మీ గణపనేనివారి గూడెంలో రైతులకు 112 పాస్ పుస్తకాలను అందించారు, రైతులకు పామాయిల్ మొక్కలను సబ్సిడీపై అందిస్తుందని వాటిని కావలసిన రైతులు హార్టికల్చర్ల్ అధికారుల ను సంప్రదించి మొక్కలను పొందాలన్నారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల భూములపైమాజీముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించి ఇచ్చిందని అవి ఎందుకు పనికిరాకుండా పోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీ సర్వే చేయించి ప్రతి రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి